ఇశ్రాయేలు ఐగుప్తులోనుండి బయలుదేరుట
నిర్గమనాన్ని దాదాపు హాస్యంలా చెబుతుంది: సముద్రం ఒక్కసారి చూసి పారిపోతుంది, యొర్దాను వెనుకకు మళ్లుతుంది, పర్వతాలు పొట్టేళ్లలా గంతులువేస్తాయి. ఆ తర్వాత కీర్తన వాటిని ప్రశ్నిస్తుంది: మీరెందుకు పారిపోయారు? బండను నీళ్లుగా మార్చిన మన తండ్రి సన్నిధే జవాబు అని తెలియజేస్తుంది.
114 1ఇశ్రాయేలు ఐగుప్తులోనుండి, యాకోబు వంశము అన్యభాష మాట్లాడు ప్రజలలోనుండి బయలుదేరి వచ్చినప్పుడు, 2యూదా మన తండ్రి పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయన రాజ్యమాయెను.
3సముద్రము చూచి పారిపోయెను; యొర్దాను వెనుకకు మళ్లెను. 4పర్వతములు పొట్టేళ్లవలె గంతులు వేసెను, కొండలు గొఱ్ఱెపిల్లలవలె గంతులు వేసెను.
5సముద్రమా, నీవెందుకు పారిపోతివి? యొర్దానూ, నీవెందుకు వెనుకకు మళ్లితివి? 6పర్వతములారా, మీరెందుకు పొట్టేళ్లవలె గంతులు వేసితిరి? కొండలారా, గొఱ్ఱెపిల్లలవలె మీరెందుకు గంతులు వేసితిరి?
7భూమీ, సర్వాధిపతియైన తండ్రి సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము, 8ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకిరాతిని పారు ఊటగాను మార్చెను.